
- ఐదు దశాబ్దాలుగా పెద్దపల్లి ప్రాంతానికి సేవలు
- వివేక్కు మంత్రి పదవి రావడం హర్షణీయం
- ఐఎన్ టీయూసీ నేషనల్సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాష
గోదావరిఖని, వెలుగు: దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి ఫ్యామిలీతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్సెక్రటరీ, ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్బాబర్ సలీం పాషా పేర్కొన్నారు. గురువారం రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్లోని యూనియన్ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రులుగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
కాకా వెంకటస్వామి కుటుంబం ఐదు దశాబ్దాలుగా పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతానికి ఎన్నో సేవలు చేస్తోందని గుర్తుచేశారు. ఎన్టీపీసీలోని 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ఏర్పాటుకు కాకా కృషి చేశారని, సింగరేణికి ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్ల లోన్ ఇప్పించి సంస్థను కాపాడడంతో పాటు లక్ష మందికి పైగా కార్మికుల జాబ్ లు కాపాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రామగుండం ఏరియాలో 18 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇప్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
ఆయన వారసులు గడ్డం వివేక్, వినోద్కూడా ఈ ప్రాంత ప్రజలకు, కార్మికులకు విశిష్ట సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించారని , కేంద్రం నుంచి రూ.10 వేల కోట్ల అప్పును మాఫీ చేయించారని, ఇప్పుడు ఐదు వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలిపారు. రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయించారన్నారు.
తాత, తండ్రి అడుగుజాడల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ నడుస్తూ కార్మికవర్గానికి మేలు చేసేలా పార్లమెంట్లో చర్చించారని పేర్కొన్నారు. రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలు చెల్లించాలని ఆయన కోరారని, అలాగే పెన్షన్ఫండ్కు ప్రతి టన్ను బొగ్గుపై అదనంగా రూ.10 జమ చేసేలా కృషి చేశారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త, నేత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లీడర్లు వేముల కృష్ణయ్య, వంగల విజయ్మోహన్, ఆరేపల్లి రాజేశ్వర్, గోపాల్రావు, నేరెళ్ల రమేశ్, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.